Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.అయితే ప్రస్తుతం హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.
ఇలా ఒకసారి వెళ్లి వచ్చిన ఆది మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణం తెలియక పోయినప్పటికీ ఈ విషయం మాత్రం తరచూ చర్చలకు కారణం అవుతుంది.ఇకపోతే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అనే పేరుతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది ఏకంగా పెదరాయుడు గెటప్ లో సందడి చేశారు. హైపర్ ఆది వేదికపై ఉండగా రష్మీ హైపర్ ఆదిని ప్రశ్నించారు. మీరు జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.
ఇలా ఆదిని ప్రశ్న అడిగినటువంటి రష్మీ జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో పాటు మరొక ఇద్దరి ఫోటోలను కూడా చూపించి కారణం చెప్పమన్నారు.హైపర్ ఆది మాత్రం తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి యాంకర్ సౌమ్యరావు కారణమంటూ అందరి ముందు ఓపెన్ గా చెప్పేసారు. ఇలా ఆది చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో పూర్తి అయింది మరి ఆది సౌమ్య వల్ల ఎందుకు జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్లాల్సి వచ్చిందనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…