Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.అయితే ప్రస్తుతం హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.
ఇలా ఒకసారి వెళ్లి వచ్చిన ఆది మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణం తెలియక పోయినప్పటికీ ఈ విషయం మాత్రం తరచూ చర్చలకు కారణం అవుతుంది.ఇకపోతే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అనే పేరుతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది ఏకంగా పెదరాయుడు గెటప్ లో సందడి చేశారు. హైపర్ ఆది వేదికపై ఉండగా రష్మీ హైపర్ ఆదిని ప్రశ్నించారు. మీరు జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.
ఇలా ఆదిని ప్రశ్న అడిగినటువంటి రష్మీ జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో పాటు మరొక ఇద్దరి ఫోటోలను కూడా చూపించి కారణం చెప్పమన్నారు.హైపర్ ఆది మాత్రం తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి యాంకర్ సౌమ్యరావు కారణమంటూ అందరి ముందు ఓపెన్ గా చెప్పేసారు. ఇలా ఆది చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో పూర్తి అయింది మరి ఆది సౌమ్య వల్ల ఎందుకు జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్లాల్సి వచ్చిందనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…