RRR Movie: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతే ఆదరణ సంపాదించుకొని ఎన్నో అవార్డులను అందుకున్నారు.ఇలా ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో పురస్కారాలు రాగా తాజాగా నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
ఇలా దేశం గర్వించేదగ్గ అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ సినిమాపై అలాగే చిత్ర బృందంపై ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందించి వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి గర్వకారణం అంటూ ప్రధాని మోడీ కూడా ఈ సినిమా విజయంపై ప్రశంసలు కురిపించి అభినందనలు తెలిపారు.
ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ సెలబ్రిటీలు అలియాభట్,అజయ్ దేవగన్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించిన ఒలీవియా మోరిస్ మాత్రం ఇప్పటివరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై స్పందించలేదు.
నిజానికి ఈ సినిమాలో నటి ఆలియా కన్నా ఈమెకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నటువంటి నాటు నాటు పాటలో కూడా ఒలీవియా మోరిస్ సందడి చేస్తూ చిందులు వేశారు.ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా విజయం పై ఇప్పటివరకు ఒలీవియా మోరిస్ స్పందించకపోవడంతో ఈమె మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి అని నేటిజన్స్ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…