Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన కొన్ని డైలాగులు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని ఉద్దేశిస్తూ ఉన్నాయని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ లోనే బాలయ్య చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్ తెగ వైరల్ అయింది. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ, ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు..” అంటూ ప్రభుత్వ నిర్ణయాలపై బాలయ్య తన డైలాగ్ సో ఘాటుగా స్పందించినట్లు ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఉద్దేశిస్తూ బాలయ్య ఈ డైలాగ్ చెప్పినట్లు అనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇది మాత్రమే కాకుండా ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులు అన్ని అధికార పార్టీని ఉద్దేశిస్తూ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన మరొక డైలాగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. ” ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్లు.. వాళ్లని గౌరవించడం మన ధర్మం, బాధ్యత ” అని ఒక సందర్భంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ వైసిపి మంత్రులను ఉద్దేశిస్తూ చెప్పినట్లు ఉంది.
ఇలా వీరసింహరెడ్డి సినిమాలో బాలయ్య చెప్పిన చాలా డైలాగ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చెప్పినట్లు ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలపై బాలయ్య తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఘాటుగా స్పందించినట్లుగా నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ డైలాగ్లకు సంబంధించిన థియేటర్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ డైలాగులపై వైసీపీ మంత్రులు కూడా స్పందిస్తూ తమదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…