jabardasth

పెళ్లి మాత్రమే చేస్తారా.. శోభనం కూడా చూపించండి.. జబర్దస్త్ స్కిట్స్‌పై ఫైర్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో మొదట్లో మంచి ఆదరణ పొందింది. కానీ రాను రాను రేటింగ్ కోసం ఎంతటి దానికైనా దిగజారుతుంది. ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో పై నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అంతేకాకుండా మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ షోని చూసి మరిన్ని బుల్లితెర షోలు కూడా తమ రేటింగ్ కోసం బాగా దిగజారుతుంది.

ఇప్పటికే జబర్దస్త్ లో రేటింగ్ కోసం యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ను జోడిని ముందుంచారు. ఇక వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అన్నట్లు ప్రేక్షకులలో ఆలోచనలు మొదలయ్యేలా చేశారు. అంతేకాకుండా గతంలో వీరి పెళ్లి కూడా బుల్లితెర వేదికగా చేయగా అదంతా నిజం కాదని కేవలం రేటింగ్ కోసమని ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశారు. నిజానికి ఏదైనా ఒక్కసారి చేస్తే కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం ఆ షో విమర్శలు ఎదుర్కోక తప్పదు.

jabardasth
jabardasth

ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఇందులో కూడా మళ్లీ పెళ్లి స్కిట్ చేశారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. ఇందులో వీరికి జంటగా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి, యాంకర్ రష్మీ పెళ్లి కూతుర్ల గెటప్ లో కనిపించారు. వీళ్లను చూసి సుధీర్, ఆది తమ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. సుధీర్ మరింత ఓపెన్ గా మాట్లాడుతూ పదిన్నర అయింది ఏమీ లేదా అని అనడంతో ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. హైపర్ ఆది రాసిన ఈ స్కిట్ కు మల్లెమాల పై కూడా టార్గెట్ పడినట్లు తెలుస్తుంది.

ఇక నెటిజన్లు ఇటువంటివి చూడలేక.. మల్లెమాల అంటే మల్లెలు, మాలలు అర్థం వచ్చేటట్లు.. మల్లెమాలా? పెళ్లిళ్ల బ్రోకరా? అంటూ శోభనం చేసేది కూడా పెట్టండి అని ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. నిజానికి ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షో లలో ఇటువంటివి స్కిట్ లను చేయడం సరైనది కాదని గతంలో జబర్దస్త్ కు విమర్శలు ఎదురుగా మళ్లీ అలాంటి స్కిట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.