Chiranjeevi: వాళ్లు ఎదగాలనే నేను తగ్గాను.. చిరు షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: వాళ్లు ఎదగాలనే నేను తగ్గాను.. చిరు షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 23వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ మాట్లాడుతూ తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని అందరికీ గుర్తు చేశారు.

Chiranjeevi: వాళ్లు ఎదగాలనే నేను తగ్గాను.. చిరు షాకింగ్ కామెంట్స్!
Chiranjeevi: వాళ్లు ఎదగాలనే నేను తగ్గాను.. చిరు షాకింగ్ కామెంట్స్!

శివశంకర వరప్రసాద్ శివుడు నృత్యానికి ప్రసిద్ధి, ఆ శివుడి ముందు ఎవరైనా డాన్స్ చేయగలరా… చాలామంది తాము డాన్స్ చేస్తున్నామని అనుకుంటారు అయితే అదంతా శివుడి తర్వాతే అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.అప్పుడప్పుడు ఇతర హీరోలను కూడా ప్రోత్సహించాలి కనుక వాళ్లు ఎదగడం కోసమే తాను తగ్గుతున్నానని మెగాస్టార్ వెల్లడించారు.

Chiranjeevi: వాళ్లు ఎదగాలనే నేను తగ్గాను.. చిరు షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా చిరంజీవి డ్యాన్స్ విషయంలో తానే కింగ్ అంటూ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈయన నటించిన ఆచార్య సినిమా 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మెగా స్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఒకే తెరపై తండ్రి కొడుకులు..

సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా ఓకే తెరపై తండ్రి కొడుకులను చూడటం కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. రామ్ చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.