నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. పది పాసైతే ఉద్యోగాలు..?

రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 374 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీలోగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు యూపీలోని బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ లో పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.blwactapprentice.in/ లేదా https://blwactapprentice.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం 374 ఉద్యోగాలలో నాన్ ఐటీఐ ఉద్యోగాలు 74, ఐటీఐ ఖాళీలు 300 ఉన్నాయి. నాన్ ఐటీఐ ఉద్యోగాలలో ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉద్యోగాలలో ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు, ఐటీఐ ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.