రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. ఎకనమిక్ సర్వే ద్వారా దేశంలోకి ప్రైవేట్ రైళ్లు రావడానికి రంగం సిద్ధమైందని వెల్లడైంది. ఈ ఏడాది మే చివరి వరకు ప్రైవేట్ రైళ్ల కొరకు బిడ్స్ ఆహ్వానం జరుగుతుందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది.
2023 – 2024 నాటికి దేశంలోకి ప్రైవేట్ రైళ్లు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేలో పేదలను పేదరికం నుంచి బయటపడేయటానికి ఆర్థిక వృద్ధిని కొనసాగించాలని అభిప్రాయపడింది. కరోనా విజృంభణ అనేక రంగాలపై ప్రభావం చూపిందని అయితే వ్యవసాయ రంగంపై మాత్రం కరోనా ప్రభావం పడలేదని వెల్లడైంది. వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైందని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం తగ్గే అవకాశం ఉందని.. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం జీడీపీ 11 శాతం పెరగవచ్చని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలీ మెడిసిన్ పై ఇన్వెస్ట్ చేసి డిజిటల్ హెల్త్ మిషన్ కు కృషి చేయాలని ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే ప్రీ కోవిడ్ స్థాయికి చేరవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.
ప్రైవేట్ రైళ్ల దిశగా కేంద్రం అడుగులు వేయడంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో నిర్ణయాలు కేంద్రం అమలు చేయనుందని తెలుస్తోంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…