సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం అని చెప్పవచ్చు.అయితే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల కొందరికి ఎన్నో సంబంధాలు వస్తున్నప్పటికీ వివాహం జరగదు. అలాంటివారు ఎన్నో పూజలు హోమాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి పెళ్లి కుదిరక తీవ్ర నిరాశ చెందుతుంటారు. ఆ విధంగా వివాహం ఆలస్యం అయ్యేవారు ఆంజనేయస్వామికి శనివారం లేదా మంగళవారం ఈ విధంగా పూజించడం వల్ల వివాహ గడియలు దగ్గర పడతాయి అని చెప్పవచ్చు.అయితే ఆ ఆంజనేయుడిని పూజించడం వల్ల ఎలాంటి శుభపరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
పెళ్లి చూపులలో ఆకర్షితులై వివాహం కుదరనివారు శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి, స్వామి వారి ఆలయంలో బియ్యపు పిండితో తయారు చేసిన ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటం వల్ల వివాహ గడియలు దగ్గర పడతాయి. అదేవిధంగా నరదృష్టి తొలగిపోయి, శత్రువుల పై విజయం సాధించాలంటే స్వామి వారి ఆలయంలో పొట్టుతీయని మినుముల పొడితో తయారు చేసిన ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల విజయం సాధిస్తారు.
అనారోగ్య సమస్యలతో బాధపడేవారు స్వామివారి ఎదుట ఆవనూనెతో ప్రమిదను వెలిగించి పూజించాలి. అదే విధంగా మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే స్వామివారి ఎదుట బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్లలో కలిపి తయారు చేసిన ప్రమిదలో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా ఆంజనేయ స్వామిని శని లేదా మంగళవారం ఈ విధంగా పూజించడం వల్ల మనం అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా కలుగుతాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…