సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వారు తీసుకొనే ఆహారం నుంచి చేసే ప్రతి పని వరకు అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి డెలివరీ అయిన కొన్ని నెలల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల్లి ,బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భందాల్చిన మహిళలు తగినన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
గర్భం దాల్చిన మహిళలు మొదటగా తాను గర్భవతి అని తెలుసుకున్న మొదటి నెల నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. ఒకేసారి అధిక మొత్తంలో ఆహారం తీసుకోకుండా వీలైనన్ని సార్లు ఆహారం తీసుకోవడం వల్ల తగినన్ని పోషకాలు శరీరానికి అంది, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎక్కువ భాగం మహిళలు ఐరన్, క్యాల్షియం, ప్రోటీనులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా గుడ్లు, పాలు, మాంసం, చేపలు, తాజా పండ్లు కూరగాయలు,వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.
అదేవిధంగా ప్రతినెల వైద్యుని సంప్రదించి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు వారి శరీరంలో రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే కొన్నిసార్లు స్కానింగ్ వంటివి చేయించుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు బరువు, ఆరోగ్య పరిస్థితి మనం తెలుసుకోవచ్చు.
గర్భం దాల్చిన మహిళలు వీలైనంతవరకు బరువైన పనులను చేయకుండా ఉండాలి. ఈ విధంగా బరువైన పనులు చేయటం వల్ల కొన్ని సార్లు గర్భస్రావమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా పగలు రెండు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వీలైనంత వరకు మనసుకు నచ్చిన పుస్తకాలు చదువుతూ, పాటలు వింటూ గడపాలి.ఇక దుస్తుల విషయంలో గర్భం ధరించిన మహిళలు ఎప్పుడు వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ జాగ్రత్తలన్నింటిని పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వాడటం వల్ల తల్లి బిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…