ఆశ.. నిరాశ.. మహిళల హాకీ జట్టు ఓటమి

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. కాంస్యం కోసం బ్రిటన్‌‌తో జరిగిన కీలక పోరులో 3-4 తేడాతో పరాజయం చవి చూసింది. ఉత్కంఠ జరిగిన ఈ పోరులో భారత మహిళల హాకీ జట్టు చేతులారా కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. భారత్‌పై ఘన విజయం సాధించిన బ్రిటన్‌ జట్టు కాంస్య పతకాన్ని ఎగురేసుకుని పోయింది.

ఈ పోరులో భారత అమ్మాయిల ఆటతీరు గురించి ఎంత చెప్పిన తక్కువే. మ్యాచ్ ప్రారంభం నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న అమ్మాయిలు గెలుపు కోసం ఆఖరి వరకు శ్రమించారు.