Pawan Kalyan: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన జనసేన… సక్సెస్ సాధించేనా?

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారారు ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇలా ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పోటీ చేసిన ప్రతిచోట అఖండమైన విజయం సాధించడంతో తెలంగాణపై కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ పోటీకి దిగబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్న ఆలయానికి వెళుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆలయానికి రావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌ నగర్‌లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ ఛైర్మన్ ఆర్కే సాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాగర్.

జనసేన పార్టీ లేకుండా రాజకీయాలు లేవు..
ఇక జనసేన తెలంగాణలో సమస్యలపై పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతుందని వెల్లడించారు.తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని సాగర్ తెలిపారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని.. ఏపీలో జనసేన విజయం ప్రభావం తెలంగాణపై ఉంటుందని వివరించారు. మరి ఈ విషయంపై పవన్ ఎలాంటి స్పష్టత ఇస్తారో తెలియాల్సి ఉంది.