Mahesh Babu: మహేష్ అందాన్ని కొరుక్కు తినాలనిపిస్తుంది.. బరితెగించిన జాన్వీ కపూర్!

Mahesh Babu:టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ యంగ్ హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అందం అభినయానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇక మహేష్ బాబుకి అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.

మహేష్ బాబు అందానికి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు సైతం మహేష్ బాబుతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటారు.ఇలా అందానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు పై తాజాగా బాలీవుడ్ నటి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మహేష్ బాబు సర్ అందం చూస్తే కొరుకు తినాలనిపిస్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఎవరికైనా వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ విషయంలో ఇందుకు విభిన్నం.

Mahesh Babu వయసు పెరిగే కొద్దీ ఆయనకు అందం పెరుగుతుంది…

ఆయనకు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుందని అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ ఈమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు మహేష్ సార్ వైపు చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు తెలియదని, అలా చూసినప్పుడు తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుంది అంటూ ఈమె మహేష్ బాబు అందంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ కాక వెంటనే మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ మహేష్ బాబుకి దిష్టి తీయడం మర్చిపోకండి అంటూ కొందరు అభిమానులు నమ్రతకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.