చేతికి పెద్ద కట్టుతో కనిపించిన జాన్వీ కపూర్.. మరోసారి ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఇదే..!

బాలీవుడ్ నటి, సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. చిన్న తనంలోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. టీనేజ్ వయస్సులో పొట్టి డ్రెస్ లు వేసుకుంటూ కుర్రకారుకు తన అందాలతో మత్తెక్కించింది. ఆ మధ్య కాలంలో ఆమె పలువురు కుర్రాళ్తో డేటింగ్ లో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలా జాన్వీ కపూర్ ఏదో ఒక కారణంతో వార్తలో నిలుస్తూ వస్తున్నారు.

మొదటిసారిగా ఆమె ధడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి.. నటనలో తన తల్లిని మించిపోయిందనే పేరు సంపాదించారు. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇలా ఆరంభంలోనే తనదైనశైలిలో నటించి.. అభిమానులను సంపాదించింది. ఇలా ఆమె అతి తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ..అందం.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఇటీవల ఆమె రూహీ అనే చిత్రంలో నటించింది.. కానీ ఇది ఆమెకు నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.
అటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా.. ఆమె విమానాశ్రయం నుంచి కిందకు వస్తూ.. అక్కడే ఉన్న కెమెరాలకు చిక్కింది. అక్కడ ఆమె చేతికి గాయం అయి.. కట్టుతో కనిపించింది జాన్వీ. ఇది చూసిన ఫొటో గ్రాఫర్లు ఆమెను ప్రశ్నించగా.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది.

దీంతో జాన్వీ ఇలా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు నెటిజన్లు. ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రం సరైంది కాదంటూ.. ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఆమె ట్రోల్స్ కు గురికావడం మొదటి సారి కాదు.. గతంలో కూడా ఆనేక సార్లు ఆమె ఇలా ట్రోల్స్ కు గురైంది. ఒకానొక సమయంలో తన స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఫొటోలకు ఫోజివ్వమని అడిగితే.. ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయింది.

అప్పుడు కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇక ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’ మరియు ‘దోస్తానా 2’. ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.