కరోనా మహమ్మారి తగ్గినట్లే చాపకింద నీరులా మరోసారి విస్తరిస్తోంది. రెండు వేవ్ లల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజానికం.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ఎస్పీ బాలులాంటి లెజెండ్స్ ను మనకు కాకుండా కూడా చేసింది ఈ మాయదారి వైరస్.
కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ మాస్టార్ శివశంకర్ కు కరోనా సోకి.. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ ఎక్కువ కావడంతో చనిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉన్నారు. ఇలా వరుసగా సెలబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు.
ఈ క్రమంలో తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గత కొద్దిరోజుల ముందు నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయింకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై’’ అంటూ రాసుకొచ్చారు అర్జున్.
తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానని అతడు వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని.. దయచేసి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…