Jayasudha: నా భర్త చనిపోయిన విషయాన్ని కూడా దాచి పెట్టారు…. ఎమోషనల్ అయిన జయసుధ!

Jayasudha: తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ ఎంతో మంది అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఈమె పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న జయసుధ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

ముఖ్యంగా తన భర్త మరణం గురించి మాట్లాడుతూ జయసుధ ఎమోషనల్ అయ్యారు.తన భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించారని అయితే ఆయన మరణించే సమయంలో తాను వేరొక చోట ఉండటం వల్ల చివరికి తన భర్త మరణించిన విషయాన్ని కూడా తన వద్ద దాచిపెట్టారని ఈమె తెలిపారు.

Jayasudha: జయప్రద తనకు ఎంతో ఆసరాగా నిలిచారు…..

తన భర్త మరణించిన విషయాన్ని తన పిల్లలకు మాత్రమే చెప్పి అమ్మకు చెప్పద్దని చెప్పారు.ఇలా తన భర్త మరణం గురించి తనకు తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని అయితే ఆ సమయంలో జయప్రద నా పక్కనే ఉండి తనకు ఎంతో ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా మరోసారి అప్పటి సంఘటనలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం జయసుధ తన భర్త మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.