Jayasudha: తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ ఎంతో మంది అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఈమె పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న జయసుధ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
ముఖ్యంగా తన భర్త మరణం గురించి మాట్లాడుతూ జయసుధ ఎమోషనల్ అయ్యారు.తన భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించారని అయితే ఆయన మరణించే సమయంలో తాను వేరొక చోట ఉండటం వల్ల చివరికి తన భర్త మరణించిన విషయాన్ని కూడా తన వద్ద దాచిపెట్టారని ఈమె తెలిపారు.
తన భర్త మరణించిన విషయాన్ని తన పిల్లలకు మాత్రమే చెప్పి అమ్మకు చెప్పద్దని చెప్పారు.ఇలా తన భర్త మరణం గురించి తనకు తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని అయితే ఆ సమయంలో జయప్రద నా పక్కనే ఉండి తనకు ఎంతో ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా మరోసారి అప్పటి సంఘటనలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం జయసుధ తన భర్త మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…