అనారోగ్యంతో బాధ పడిన జెస్సి.. అసలు పట్టించుకోని షన్ను, సిరి…?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ రియాలిటీ షో తెలుగులో ఐదవ సీజన్ 8 వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 9వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ క్రమంలోనే 9వ వారం నామినేషన్లు భాగంగా కేవలం కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ తప్ప.. మిగిలిన పది మంది కంటెస్టెంట్ లో నామినేషన్ లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇంట్లో త్రిమూర్తులుగా ఉన్నటువంటి జెస్సీ,షన్ను, సిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముగ్గురు కలిసి ఎంతో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ఇకపోతే గత ఎపిసోడ్ లో భాగంగా జెస్సీ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

ఇలా ఉదయం నుంచి జెస్సీ వాంతులు చేసుకుంటూ ఉన్నప్పటికీ అతనికి షన్ను, సిరి ఏ మాత్రం సహాయ పడలేదు. ఇలాంటి సమయంలో జెస్సికీ తోడుగా సన్నీ ఉండి అతని బాగోగులు చూసుకున్నాడు. అనంతరం బెడ్ పైకి వెళ్లిన జెస్సీ ఎంతో అస్వస్థతకు గురైనప్పటికీ షన్ను పక్కనే ఉన్నాగాని తనని చూసి చూడనట్టు వదిలేశాడు కనీసం మాటకూడా మాట్లాడకపోవడంతో జెస్సి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ తనకు అనారోగ్యం చేయడంతో వీరిద్దరూ ఏమాత్రం స్పందించకపోవడం ఎంతో విడ్డూరం.

ఇక ఈ విషయం గురించి మానస్, సన్నీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లు వారి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయని మానస్ సన్నీకి చెబుతాడు. మానస్‌ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సన్నీకి సలహా ఇచ్చాడు. జెస్సీ కి అనారోగ్యం చేయడంతో షణ్ముక్ సిరి మాట్లాడింది కాకపోవడంతో జెస్సీ అభిమానులు వీరిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.