ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త…బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న తారక్.. ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అడుగుపెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోను ఎంతటి విజయవంతం చేశారో మనకు తెలిసింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ వరుసగా నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కు ముస్తాబవుతోంది. బిగ్ బాస్ తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు? కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఎప్పుడో ఈ కార్యక్రమం ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ కార్యక్రమ షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చక్కపడుతుండడంతో మెల్లిగా అన్ని కార్యక్రమాలు షూటింగ్ లను జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న టువంటి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమై శరవేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలోనే తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”ఆట నాది గెలుపు మీది” అంటూ నయా షో తో రాబోతున్నట్టుగా ఇది వరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి సంబంధించి నేటి (జూలై 10) నుంచి జూలై 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం షూటింగ్లో పాల్గొననున్నారనే వార్త వినబడుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతోంది అని చెప్పవచ్చు.