యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అడుగుపెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోను ఎంతటి విజయవంతం చేశారో మనకు తెలిసింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ వరుసగా నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కు ముస్తాబవుతోంది. బిగ్ బాస్ తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు? కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఎప్పుడో ఈ కార్యక్రమం ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ కార్యక్రమ షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చక్కపడుతుండడంతో మెల్లిగా అన్ని కార్యక్రమాలు షూటింగ్ లను జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న టువంటి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమై శరవేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలోనే తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”ఆట నాది గెలుపు మీది” అంటూ నయా షో తో రాబోతున్నట్టుగా ఇది వరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి సంబంధించి నేటి (జూలై 10) నుంచి జూలై 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం షూటింగ్లో పాల్గొననున్నారనే వార్త వినబడుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతోంది అని చెప్పవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…