కార్తీకదీపం సీరియల్ లో… కార్తీక దీప ఎప్పుడు కలుస్తారో చెప్పేసిన డైరెక్టర్..?

బుల్లితెరపై టాప్ రేటింగ్ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు తీవ్ర ఉత్కంఠతో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉన్నారంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ లో దీపకు కార్తీక్ పెట్టే టార్చర్ చూడలేక అభిమానులు ఈ సీరియల్ డైరెక్టర్ కు ఓరేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఎన్నో సినిమాలకు,సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాని గుర్తింపు డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర గారికి కార్తీకదీపం బాగా పేరు తెచ్చి పెట్టింది. కొంతమంది అభిమానులు ఈ సీరియల్ ఇంకా ఎన్ని రోజులు సాగ దీస్తారుఅంటూ తిడుతున్నప్పటికీ.. ఈ సీరియల్ సాగదీయడం ప్రేక్షకుల కోసమే అంటూ సమాధానం చెప్పారు.

అన్ని సీరియల్స్ లో మాదిరిగానే ఈ సీరియల్లో కూడా దీప కార్తీక్ ను కలిపేస్తే కథ రోటీన్ గానే ఉంటుంది. అందుకోసమే ఈ సీరియల్ ను సాగదీస్తున్నామని ఈ సీరియల్ సాగదీసే క్రమంలో బోర్ కొట్టినప్పుడు ఇందులో ట్విస్టులు పెడుతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రేక్షకులు ఈ సీరియల్ అయిపోవాలని కోరుకోవడం లేదు… ఈ సీరియల్ లో కార్తీక దీపం ఎప్పుడు కలుస్తారు? మోనిత నిజం ఎప్పుడు బయట పడుతుందని మాత్రమే ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు చూస్తుంటే.. కార్తీకదీపం సీరియల్ కు ఇప్పుడే ఎండ్ కార్డ్ పడేలాలేదని తెలుస్తోంది.అదేవిధంగా దీపా, కార్తీక్ ఇప్పుడే కలవరనీ డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. అయినా ఈ సీరియల్ కు శుభంకార్డు పడితే జనాలు ఏం చేస్తారని.. అందుకోసమే ఈ కథను సాగదీస్తున్నట్లు తెలిపాడు.ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ కథలో ఇంకెన్ని ట్విస్ట్ లను మనం చూడాల్సి వస్తుందోనని అభిమానులు భావిస్తున్నారు.