బుల్లితెరపై టాప్ రేటింగ్ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు తీవ్ర ఉత్కంఠతో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉన్నారంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ లో దీపకు కార్తీక్ పెట్టే టార్చర్ చూడలేక అభిమానులు ఈ సీరియల్ డైరెక్టర్ కు ఓరేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఎన్నో సినిమాలకు,సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాని గుర్తింపు డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర గారికి కార్తీకదీపం బాగా పేరు తెచ్చి పెట్టింది. కొంతమంది అభిమానులు ఈ సీరియల్ ఇంకా ఎన్ని రోజులు సాగ దీస్తారుఅంటూ తిడుతున్నప్పటికీ.. ఈ సీరియల్ సాగదీయడం ప్రేక్షకుల కోసమే అంటూ సమాధానం చెప్పారు.
అన్ని సీరియల్స్ లో మాదిరిగానే ఈ సీరియల్లో కూడా దీప కార్తీక్ ను కలిపేస్తే కథ రోటీన్ గానే ఉంటుంది. అందుకోసమే ఈ సీరియల్ ను సాగదీస్తున్నామని ఈ సీరియల్ సాగదీసే క్రమంలో బోర్ కొట్టినప్పుడు ఇందులో ట్విస్టులు పెడుతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రేక్షకులు ఈ సీరియల్ అయిపోవాలని కోరుకోవడం లేదు… ఈ సీరియల్ లో కార్తీక దీపం ఎప్పుడు కలుస్తారు? మోనిత నిజం ఎప్పుడు బయట పడుతుందని మాత్రమే ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు చూస్తుంటే.. కార్తీకదీపం సీరియల్ కు ఇప్పుడే ఎండ్ కార్డ్ పడేలాలేదని తెలుస్తోంది.అదేవిధంగా దీపా, కార్తీక్ ఇప్పుడే కలవరనీ డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. అయినా ఈ సీరియల్ కు శుభంకార్డు పడితే జనాలు ఏం చేస్తారని.. అందుకోసమే ఈ కథను సాగదీస్తున్నట్లు తెలిపాడు.ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ కథలో ఇంకెన్ని ట్విస్ట్ లను మనం చూడాల్సి వస్తుందోనని అభిమానులు భావిస్తున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…