బుల్లితెరపై టాప్ రేటింగ్ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు తీవ్ర ఉత్కంఠతో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉన్నారంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ లో దీపకు కార్తీక్ పెట్టే టార్చర్ చూడలేక అభిమానులు ఈ సీరియల్ డైరెక్టర్ కు ఓరేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఎన్నో సినిమాలకు,సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాని గుర్తింపు డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర గారికి కార్తీకదీపం బాగా పేరు తెచ్చి పెట్టింది. కొంతమంది అభిమానులు ఈ సీరియల్ ఇంకా ఎన్ని రోజులు సాగ దీస్తారుఅంటూ తిడుతున్నప్పటికీ.. ఈ సీరియల్ సాగదీయడం ప్రేక్షకుల కోసమే అంటూ సమాధానం చెప్పారు.
అన్ని సీరియల్స్ లో మాదిరిగానే ఈ సీరియల్లో కూడా దీప కార్తీక్ ను కలిపేస్తే కథ రోటీన్ గానే ఉంటుంది. అందుకోసమే ఈ సీరియల్ ను సాగదీస్తున్నామని ఈ సీరియల్ సాగదీసే క్రమంలో బోర్ కొట్టినప్పుడు ఇందులో ట్విస్టులు పెడుతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రేక్షకులు ఈ సీరియల్ అయిపోవాలని కోరుకోవడం లేదు… ఈ సీరియల్ లో కార్తీక దీపం ఎప్పుడు కలుస్తారు? మోనిత నిజం ఎప్పుడు బయట పడుతుందని మాత్రమే ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు చూస్తుంటే.. కార్తీకదీపం సీరియల్ కు ఇప్పుడే ఎండ్ కార్డ్ పడేలాలేదని తెలుస్తోంది.అదేవిధంగా దీపా, కార్తీక్ ఇప్పుడే కలవరనీ డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. అయినా ఈ సీరియల్ కు శుభంకార్డు పడితే జనాలు ఏం చేస్తారని.. అందుకోసమే ఈ కథను సాగదీస్తున్నట్లు తెలిపాడు.ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ కథలో ఇంకెన్ని ట్విస్ట్ లను మనం చూడాల్సి వస్తుందోనని అభిమానులు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…