బుల్లితెర నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నవ్య స్వామి ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర పైకి అడుగుపెట్టిన నవ్య స్వామి అతి తక్కువ సమయంలోనే పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం నవ్య స్వామి “ఆమె కథ” సీరియల్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ సీరియల్ లో నటుడు రవికృష్ణతో జోడికట్టి అద్భుతంగా నటించారు.వీరి నటన చూసిన ప్రేక్షకులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని పలు సందర్భాలలో నవ్య స్వామి తెలిపారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు భారీగానే ఉన్నారు.
తాజాగా ఓ అభిమాని తమ అభిమాన నటిని ఏకంగా అలనాటి అందాల తారలు సావిత్రి, సౌందర్యతో పోల్చాడు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన మీమ్ ను నవ్య స్వామి తన స్టేటస్ లో పెట్టగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…