బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు భారీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది. గత ఎపిసోడ్ లో మోనిత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన ఆనందరావు గుండెపోటుతో ఆసుపత్రి పాలవుతాడు. ఈ క్రమంలోనే దీప ఈపెళ్లి జరగదని ఖరాఖండిగా మోనితకి వార్నింగ్ ఇస్తుంది.
దీప వార్నింగ్ ఇవ్వడంతో మోనిత విషం కలిపిన నీళ్లను బాటిల్ లోకి తీసుకుని దీప ఇంటికి వెళ్లి బెదిరిస్తుంది. మోనిత ఇలా బెదిరించడంతో అందరూ ఎంతో షాక్ అవుతారు. కానీ దీప మాత్రం తాగవే.. ఈ నీళ్లు తాగు అంటూ బెదిరిస్తుంది. మోనిత కంగారు పడటంతో ఆ బాటిల్ లోని నీటిని దీప తాగుతుంది. ఈ క్రమంలోనే దీప విషం కలిపిన నీళ్లు తాగటంతో అభిమానులు ఆ తర్వాత ఏం జరుగుతుందో అని తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అవి నిజంగానే విషం కలిపిన నీళ్లు అయితే వంటలక్క చనిపోతుందా… దీప చనిపోతే కార్తీక్, మోనితల పెళ్లి జరుగుతుందా.. ఏంటి ఈ ట్విస్ట్ మాకు అంటూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. నిజంగానే దీప చనిపోతుందా..?కార్తీక్,మోనిత పెళ్లి జరుగుతుందా..? అనే విషయం తెలియాలంటే మనం సోమవారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…