నో డౌట్.. కార్తీక్ మోనితను చంపేసి ఉంటాడు.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య!

కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. గత ఎపిసోడ్ లో సౌందర్య తన తుపాకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి మోనితను తనే చంపానని, తనను అరెస్టు చేసి తన కొడుకుని వదిలిపెట్టమని చెబుతుంది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా సౌందర్య మోనితను చంపానని లొంగిపోవడానికి రావడంతో రోషిని మాత్రం కొడుకు పై ప్రేమతో అబద్ధం చెబుతోందని తను హత్య చేయలేదని కనిపెడుతుంది. మీరు ఇవాళ ఉదయం అమెరికా నుంచి వస్తే నిన్న ఎలా మర్డర్ చేశారని రోషిని ప్రశ్నిస్తుంది. వెంటనే మీరు చాలా తెలివైన వారు నేను మర్డర్ చేయలేదని కనిపెట్టిన మీరు కార్తీక్ మర్డర్ చేయలేదని ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటూ ప్రశ్నిస్తుంది.

ఈ విధంగా ఏసిపి రోషిని సౌందర్య వద్ద మాటల యుద్ధం జరుగుతుంది. అసలు కార్తీక్ హద్దులు మీరి స్నేహం చేస్తున్నప్పుడు మీరు మొగ్గలోనే ఆ స్నేహాన్ని తుంచి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రోషిని అనడంతో మోనిత కడుపు కారణం నా కొడుకు కాదని, ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని మోనిత కృత్రిమ గర్భం ధరించిందని షాకింగ్ విషయాన్ని చెబుతుంది. ముందుగా మీరు ఈ కేసును ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచిదని చెప్పి సౌందర్య వెళ్ళిపోతుంది.

ఇక భాగ్యం తన కారణంగానే కార్తీక్ అరెస్ట్ అయ్యాడు అని బాధపడుతుంటే మురళీకృష్ణ తనకి తినడానికి అన్నం తీసుకువచ్చి కాస్త తినమని చెబుతాడు.నువ్వు చెప్పకపోయినా ఆధారాలు బలంగా ఉన్నాయి కనుక కార్తీక్ బాబు విషయం బయట పడుతుందని భాగ్యానికి నచ్చ చెబుతాడు. ఇంతలోనే కార్తీకదీపం సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. కానిస్టేబుల్ గా ఎంట్రీ ఇచ్చి కార్తీక్ ను డాక్టర్ సార్ మీకు టీ తెచ్చాను. మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది.

ఇక దీప పిల్లలు కార్తీక్ కోసం ఏడుస్తూ కూర్చోగా..పిల్లలు మీరు విడిగా ఉన్నప్పుడే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఇద్దరూ కలిసి పోయి ఇలా దూరం అవుతారు అనుకుంటే మిమ్మల్ని అసలు కలవనిచ్చే వాళ్ళం కాదు అంటూ ఏడుస్తారు. అప్పుడే అక్కడికి సౌందర్య ఎంట్రీ ఇస్తుంది. నాన్నమ్మ నాన్నను పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పగా.. ఇప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్లి వస్తున్నాను తొందర్లోనే మీ నాన్న బయటకు వస్తాడు.మీ నాన్న మిమ్మల్ని నాతో తీసుకెళ్లామన్నారు మీరు వెళ్లి బట్టలు సర్దుకొని అని చెబుతుంది.

ఆ తరువాత దీప మాట్లాడుతూ.. ఎలా ఉన్నారు అత్తయ్య ఆయన అని అడుగుతుంది. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకొని నువ్వు బట్టలు సర్దుకొని బయలుదేరు అని చెబుతుంది. కట్ చేస్తే ఏసిపి రోషిని సౌందర్య అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయినా కార్తీక్ తప్పు చేశాడు. కార్తీక్ చాలా తెలివైనవాడు.మంచి ముసుగు వేసుకుని ఎన్నో అడ్డదారులు తొక్కడం తన తల్లికి భార్యకు దగ్గర మంచివాడిగా నటిస్తూ మోనితను అన్యాయం చేశాడు. మోనితకి కడుపు చేశాడు. మోనిత పెళ్లి చేసుకోవాలని అడగగా తనని చంపేశాడు ఎలాగైనా మోనిత శవం ఎక్కడ ఉన్నా తెలుసుకొని అన్ని విషయాలు బయటపెడతా అని అంటుంది.

ఇక భాగ్యం దీప ఇంటికి వెళ్లి శ్రావ్ తో మీ అత్తగారు ఎక్కడ అని అడిగగా అంతలో సౌందర్య రావడంతో తన దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుతూ నేను ఏం చేయలేదు వదిన అంటూ బాధపడుతుంది. అందుకు సౌందర్య నువ్వేం చేసావ్ భాగ్యం అని చెబుతూ అక్కడే కూర్చున్నటువంటి దీప దగ్గరికి వెళ్లి అసలేం జరిగింది దీప అని అడగగా.. దీప కార్తీక్ కి చూపించిన వీడియోను సౌందర్య కూడా చూపిస్తుంది. ఆ వీడియో చూసిన సౌందర్య ఎంతో షాక్ అవుతుంది. ఈ వీడియో చూడగానే నో డౌట్ మోనితను కార్తీక్ చంపేసి ఉంటాడు అని సౌందర్య అనడంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.