KCR: కెసిఆర్ మినహా అందరూ బీజేపీ వదిలిన బాణాలే: మంత్రి గంగుల కమలాకర్

KCR: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సంచలనంగా మారాయి.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పాటు గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సెగ తగులుతుంది. ఇక తెలంగాణలో అయితే బి ఎస్ ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎంతో మంది నాయకులు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో తమ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు వైయస్సార్ కుమార్తె షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ తన పార్టీని బలోపేతం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

KCR: తెలంగాణ సంపదను దోచుకోవడమే ధ్యేయం…


ఇలా వచ్చే ఎన్నికలలో తెలంగాణను టార్గెట్ చేస్తూ చాలా పార్టీలు పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే బిఎస్ఆర్ పార్టీనేత మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి బిజెపి వదిలిన బాణాలే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక కేసీఆర్ మినహా వీళ్లంతా కూడా బిజెపి వదిలిన బాణాలే అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.