ఈటల-కేసీఆర్ వెన్నపోటు ఎపిసోడ్.. త్వరలో సినిమా: వర్మ

సంచలనాల దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది. అతడు ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లు కూడా అలాగే ఉంటాయి. అతడిని ఎంత మంది విమర్శిస్తురో.. అంత కంటే ఎక్కువగా అతడిని ఫాలో అవుతుంటారు. అయితే ఈ వివాదాల దర్శకుడు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి అతడు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.

అది పెద్ద వైరల్ గా మారింది. అతడు ఏమని పోస్టు చేశాడంటే.. ‘‘గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పదవి ఎలా సొంతం చేసుకున్నారో… ఈటల కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తుంది. అందుకే కేసీఆర్- ఈటల వెన్నుపోటు ఎపిసోడ్ పై తెలంగాణా రాజకీయ మేధావులతో చర్చించి… మూవీ చేస్తానంటూ ప్రకటించారు.

అలాగే ఈటల, కేసీఆర్ మార్ఫింగ్ ఫొటోలతో వెన్నుపోటు టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల అభిమానులు ఆర్బీవీపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అతడు ప్రయత్నిస్తున్నాడని ఇది కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అతడు ఇటీవల కొండా సురేఖ, మురళి దంపతులకు సంబంధించి బయోపిక్ కు తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి షెడ్యూల్ కూడా మొదలైంది. ఆ సినిమాను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈటల వెన్నుపోటు చిత్రంలో వర్మ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తాడో చూడాలి మరి.