సంచలనాల దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది. అతడు ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లు కూడా అలాగే ఉంటాయి. అతడిని ఎంత మంది విమర్శిస్తురో.. అంత కంటే ఎక్కువగా అతడిని ఫాలో అవుతుంటారు. అయితే ఈ వివాదాల దర్శకుడు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి అతడు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.
అది పెద్ద వైరల్ గా మారింది. అతడు ఏమని పోస్టు చేశాడంటే.. ‘‘గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పదవి ఎలా సొంతం చేసుకున్నారో… ఈటల కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తుంది. అందుకే కేసీఆర్- ఈటల వెన్నుపోటు ఎపిసోడ్ పై తెలంగాణా రాజకీయ మేధావులతో చర్చించి… మూవీ చేస్తానంటూ ప్రకటించారు.
అలాగే ఈటల, కేసీఆర్ మార్ఫింగ్ ఫొటోలతో వెన్నుపోటు టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల అభిమానులు ఆర్బీవీపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అతడు ప్రయత్నిస్తున్నాడని ఇది కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అతడు ఇటీవల కొండా సురేఖ, మురళి దంపతులకు సంబంధించి బయోపిక్ కు తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి షెడ్యూల్ కూడా మొదలైంది. ఆ సినిమాను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈటల వెన్నుపోటు చిత్రంలో వర్మ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తాడో చూడాలి మరి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…