లవ్ ట్రాక్ నడిపించాలని అనుకుందట.. కానీ ఇలా చేసారేంటి బిగ్‌బాస్‌ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన లహరి.

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గ్రాండ్‌గా మొదలైన విషయం తెలిసిందే.. ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ ఎంతో సందడిగా ఉంది. ఇక ఈ షోలో సోమవారం మొదటి రోజు ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ఏం జరిగిందనే దగ్గర నుంచి ప్రారంభమైంది మొదటి రోజు బిగ్ బాస్ షో.. ఈ క్రమంలో నటుడు లోబో గురక పెట్టి నిద్రపోతున్న దృశ్యాలు కనిపించాయి. దానిని కవర్ చేసేందుకు ఇంటి సభ్యులు పడే పాట్లు కాస్త నవ్వు తెప్పించాయి.

ఈ నేపద్యంలో ఇంటి సభ్యులను ఉద్దేశించి లహరి శరి కొన్ని వ్యాఖ్యలు ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. ఇక్కడకి రాకముందు హౌస్ లో ఎవరో ఒకరితో లవ్‌ ట్రాక్ నడిపించాలని అనుకున్నానని.. తీరా ఇక్కడకి వచ్చాక చూస్తె చాలా మంది పెళ్లైన వాళ్ళే ఉన్నారని, ఇక సన్నీ ఉన్నా తనకు ఇదివరకే తెలుసనీ అందువల్ల అతనిపై అటువంటి ఫీలింగ్స్ లేవంటూ మాట్లాడింది. మరో కంటెస్టెంట్స్ శ్రీరామ్‌ చంద్ర, జెస్సీ ల గురించి మాట్లాడుతూ.. శ్రీరామచంద్ర ఎందుకో కనెక్ట్ అవ్వలేదని, ఇక మోడల్ జెస్సీ తో అసలు ర్యాపో కుదరడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇలా చేసారెంటి బిగ్‌బాస్‌ అంటూ కాజల్‌తో చెప్పుకుంది.