అవకాశాలు తగ్గడంతో ఆ పాత్రలలో కూడా చేశాడు సుత్తి వేలు!

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎప్పుడూ సంతోషంగా, ధనవంతులు గా ఉంటారు అనుకోవడం పొరపాటేనని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు ఒకేలా ఉండరు. పైగా అవకాశాలు లేనప్పుడు మాత్రం వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. ఇలా ఎంతో మంది నటులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగా.. ఒకప్పటి తెలుగు సినీ నటుడు సుత్తి వేలు కూడా అవకాశాలు తగ్గడంతో ఆయన పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది.

ఒకప్పటి తెలుగు సినీ హాస్య నటుడు సుత్తివేలు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని హాస్యనటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్ లో నటించాడు. ఇక ఈయన దాదాపు రెండు వందలకు పైగా సినిమాలలో నటించాడు.

ఇక ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడినా ఫలితాన్ని అందుకోలేకపోయాడు. పైగా సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం బుల్లితెర సీరియల్స్ పై ఆధారపడ్డాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా పలు సీరియల్స్ లో కూడా నటించాడు.

ఇక ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడటంతో బుల్లితెరలో అంత ప్రాధాన్యం లేని పాత్రలలో కూడా నటించాడు. ఇక చివరి వరకు ఇండస్ట్రీతోనే తన జీవనాన్ని సాగించాడు. 2012 సెప్టెంబర్ లో ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడు. అప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు ఉండగా చూడటానికి 70 ఏళ్లకు పైగా ఉన్న వాడిలా మారిపోయాడు. ఇక ఈయన మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తట్టుకోలేకపోయింది. ఇక ఇప్పటికీ ఈయన సినిమాలను ఒకప్పటి తెలుగు ప్రేక్షకులే కాకుండా ఈ తరం ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతుంటారు.