Movie News

అవకాశాలు తగ్గడంతో ఆ పాత్రలలో కూడా చేశాడు సుత్తి వేలు!

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎప్పుడూ సంతోషంగా, ధనవంతులు గా ఉంటారు అనుకోవడం పొరపాటేనని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు ఒకేలా ఉండరు. పైగా అవకాశాలు లేనప్పుడు మాత్రం వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. ఇలా ఎంతో మంది నటులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగా.. ఒకప్పటి తెలుగు సినీ నటుడు సుత్తి వేలు కూడా అవకాశాలు తగ్గడంతో ఆయన పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది.

ఒకప్పటి తెలుగు సినీ హాస్య నటుడు సుత్తివేలు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని హాస్యనటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్ లో నటించాడు. ఇక ఈయన దాదాపు రెండు వందలకు పైగా సినిమాలలో నటించాడు.

ఇక ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడినా ఫలితాన్ని అందుకోలేకపోయాడు. పైగా సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం బుల్లితెర సీరియల్స్ పై ఆధారపడ్డాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా పలు సీరియల్స్ లో కూడా నటించాడు.

ఇక ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడటంతో బుల్లితెరలో అంత ప్రాధాన్యం లేని పాత్రలలో కూడా నటించాడు. ఇక చివరి వరకు ఇండస్ట్రీతోనే తన జీవనాన్ని సాగించాడు. 2012 సెప్టెంబర్ లో ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడు. అప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు ఉండగా చూడటానికి 70 ఏళ్లకు పైగా ఉన్న వాడిలా మారిపోయాడు. ఇక ఈయన మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తట్టుకోలేకపోయింది. ఇక ఇప్పటికీ ఈయన సినిమాలను ఒకప్పటి తెలుగు ప్రేక్షకులే కాకుండా ఈ తరం ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతుంటారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago