సావిత్రి లాగా నేను కూడా మోసపోయాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ షాకింగ్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి ఎన్నో వందల చిత్రాలలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తను పుట్టడమే డైమండ్ స్పూన్ తో పుట్టానని, చివరికి అల్యూమినియం స్పూన్ కూడా దొరకని పరిస్థితికి వెళ్లానని తన జీవితంలో జరిగిన ఒడిదుడుకులు గురించి వెల్లడించారు.

తనకు 4అన్నయ్యలు ఒక తమ్ముడు అని ఎక్కడికి వెళ్లిన వారు తనను ఎంతో బాగా చూసుకునే వారని సుధ వెల్లడించారు. అయితే తన తండ్రికి క్యాన్సర్ రావడం వల్ల ఉన్న డబ్బులు మొత్తం నాన్నకు చికిత్సకు సరిపోయాయని ఆ సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించామని అలా నాన్నకు అనారోగ్యం చేయటం వల్లే కుటుంబం కోసం తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని సుధా తెలియజేశారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకునప్పటికీ తాను బాగా మోసపోయానని వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు షూటింగుకి వెళ్తే ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చే దాన్ని ఆ సమయంలో తనకు కావలసిన పనులను చేయడం కోసం పూర్తిగా మరొకరిపై ఆధారపడ వలసి వచ్చిందని ఇలా వేరొకరిని నమ్మి వారి చేతుల్లో తాను సంపాదించిన డబ్బులు పెట్టడం వల్ల పూర్తిగ మోసపోయానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

అప్పట్లో సావిత్రి ఏ విధంగా అయితే ఇతరులను నమ్మి తన సర్వస్వం కోల్పోయిందో ఒకానొక సమయంలో నేను కూడా అలాగే ఎంతో డబ్బును నష్టపోయానని సుధా వెల్లడించారు. అయినా నా కష్టాన్ని దోచుకొని తిన్న వారికి ఏమాత్రం సహించదని, ఇది తప్పుని వారు తెలుసుకున్నప్పుడే ఈ విధమైనటువంటి తప్పులు జరగవని ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.