బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో మహేష్ కొత్త సినిమా.. ఈరోజే ప్రకటన!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ ని కూడా ప్రారంభించింది. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.సర్కారీ వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో చేస్తారా అనే విషయంపై పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

సర్కారీ వారి పాట తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయడానికన్న ముందుగా మరొక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ ఎవరు అనే అనుమానాలు కలిగాయి.సర్కారు వారి పాట తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటనను ఈ రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో విడుదలైన అతడు, ఖలేజా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.అయితే వీరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ప్రకటన ఈ రోజు విడుదల కాకపోయినా ఈ నెల 31 తప్పకుండా వెలువడే అవకాశం ఉంది.

ఇకపోతే సర్కారీ వారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. అదేవిధంగా సినిమా టీజర్ ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజున విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.