టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ ని కూడా ప్రారంభించింది. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.సర్కారీ వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో చేస్తారా అనే విషయంపై పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
సర్కారీ వారి పాట తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయడానికన్న ముందుగా మరొక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ ఎవరు అనే అనుమానాలు కలిగాయి.సర్కారు వారి పాట తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటనను ఈ రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో విడుదలైన అతడు, ఖలేజా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.అయితే వీరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ప్రకటన ఈ రోజు విడుదల కాకపోయినా ఈ నెల 31 తప్పకుండా వెలువడే అవకాశం ఉంది.
ఇకపోతే సర్కారీ వారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. అదేవిధంగా సినిమా టీజర్ ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజున విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…