క్యాన్సర్ తో భార్య మృతి.. ఇంటిని శుభ్రం చేస్తుండగా అతడు షాక్ అయ్యాడు.. ఏం జరిగిందంటే..?

వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఆమెకు పిల్లలు లేరు. అంతే కాకుండా ఆమె ఇటీవల క్యాన్సర్ రావడంతో చనిపోయింది. దీంతో ఆమె భర్త ఒక్కడే ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇంటిని సర్దుతుండగా అతడికి అనుకోని దృశ్యం కంటపడింది. ఒక ప్రదేశంలో ఓ మృతదేహం కనిపించింది. వెంటనే భయపడిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రదేశం మొత్తం గాలిస్తుండగా అక్కడ మరో రెండు మృతదేహాలు దొరికాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని మెజెరే లో 41 సంవత్సరాల వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి భార్య ఈ మధ్య క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయింది. దీంతో ఇంటిని శుభ్రం చేసే క్రమంలో అతడికి ఓ మృతదేహం కంటపడింది. ఇంట్లో బాలుడి మృతదేహం గుర్తించిన అతడు ఆశ్చర్యపోయాడు.

వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుడిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాలుడి శవాన్ని పరిశీలించి.. చుట్టు పక్కల ప్రదేశంలో కూడా ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వెతకడం మొదలు పెట్టారు. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్న మరో బ్యాగులో రెండు శవాలు కనిపించాయి.

ఆ మూడు మృతదేహాలు పిల్లలవే కావడం విశేషం. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే అతడి భార్యకు ఇంతక ముందే పెళ్లి అవడం.. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటం.. ఇప్పుడు ఆమె రెండో వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారు. ఏదేమైనా స్థానికంగా ఇది సంచలనం స్పష్టించింది. ఒకే ఇంట్లో మూడు శవాలు ఉండటం అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.