నాలుగు రోజుల క్రితం కాన్పుకు ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఓ గర్భిణి. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆ శిశువుకు ఆరోగ్యం బాగాలేదని వైద్యులకు చూపించగా.. సపరేట్ రూంలో ఆమెను తన శిశువును ఉంచారు. అన్నం తీసుకురావడానికి వెళ్లిన ఆమె భర్త.. ఆసుపత్రికి వచ్చేసరికి అతడి భార్య పక్కన ఆ శిశువు కనిపించలేదు.
దీంతో అతడు ఆసుపత్రి సిబ్బందికి చెప్పాడు. లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన కోమలి అనే మహిళ పురిటి నొప్పులతో స్థానికంగా ఉండే ఓ ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ రోజే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమె శనివారం ఉదయం అంటే ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉంది.
ఆ శిశువుకు ఆరోగ్యం మంచిగా లేకపోవడంతో తల్లితో సహా ఆ పసికందును ఆసుపత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే కోమలి భర్త శ్రీరాములు భోజనం తేవడానికి బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి ఆ పసికందు మాయం అయిపోయింది. వెంటనే ఆసుపత్రి పరిసరాలంతా వెతికారు. అయినా ఉపయోగం లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీఫుటేజీ పరిశీలించారు. ఆ సీసీటీవీలో ఆ పసికందును ఓ బుర్ఖా వేసుకున్న ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అందులో ఆమె కాళ్లకు కనీసం చెప్పులు కూడా ధరించకుండా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…