హత్యలు, అత్యాచారాలు దేశంలో ప్రతీ రోజు ఏక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఈ కామాంధులు వినడం లేదు. ఎంత కఠినంగా శిక్షలు విధించినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి యూపీలో చోటుచేసుకుంది. మహిళ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఆ సమయంలో ప్రియుడితో ఉండగా.. మరో మహిళ చూసింది. దీంతో ఇద్దరు కలిసి ఆమెను గొంతుకోసి హత్య చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీరట్ జిల్లా పస్వాడా గ్రామాని చెందిన ఓ మహిళ .. తన ప్రియుడు కలిసి ఓ అటవి ప్రాంతంలో ఉన్నారు. ఆ పనిలో ఉండగా అదే గ్రామానికి చెందిన మరో మహిళ లక్ష్మినీ (45) చూసింది. ఈ విషయం బయట చెబితే ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఇద్దరు కలిసి ఆమె గొంతు కోసి హత్య చేశారు.
అక్కడ నుంచి వాళ్లు పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శవాన్ని పోస్టమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్ధలంలో నిందితులకు సంబంధించిన చెప్పులు, వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతుండగా.. తాజాగా దొరికిన ఆధారాల ప్రకారం పోలీస్ డాగ్ నిందితుల ఆనవాళ్లను పసిగట్టింది.
ఆ డాగ్ గ్రామంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. అక్కడ ఓ మహిళ ఉంది. పోలీసులు ఆమెను ప్రశ్నించగా నిజం జరిగిన తతంగం మొత్తం చెప్పేసింది. తమ మధ్య ఆ బంధం గురించి ఎవరికైనా చెబుతుందనే భయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ వివరాలన్నీ వెల్లడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…