Manoj: చీకటిలో ఉన్న నాకు మౌనిక వెలుగులు నింపింది.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మనోజ్?

Manoj: మంచు మనోజ్ మౌనిక దంపతులు ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టారని తెలుస్తుంది. అదే విధంగా బుల్లితెర కార్యక్రమాలను కూడా ఈయన చేస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇటీవల ముంబై వెళ్లి ముఖేష్ అంబానీ కలిసినటువంటి మనోజ్ ఎందుకు కలిశారు అన్న సందేహాలు అందరికీ వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా ఈయన ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మేము రిలయన్స్ వారితో కలిసి పిల్లల కోసం ముంబైలో సరికొత్తగా ఒకటి ప్లాన్ చేశామని త్వరలోనే ఈ విషయాలన్నింటిని కూడా తెలియచేయబోతున్నామని విరామానికి ఇది ఒక జవాబుగా మారుతుందని మనోజ్ తెలిపారు.

జీవితంపై ఆశను కల్పించింది…

ఇక ఈ ఏడేళ్ల విరామంలో వ్యక్తిగతంగా తనకు మంచి జరిగిందని తెలిపారు. మొదటి మూడు సంవత్సరాలు మనో ధైర్యాన్ని కోల్పోయి చాలా చీకటిని చూశానని ఆ సమయంలో మౌనిక నా లైఫ్ లోకి వచ్చి వెలుగులు నింపిందని మనోజ్ వెల్లడించారు. లైఫ్ పై ఆశను చిగురింపజేసిందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇక సినిమాలపై నాకున్నటువంటి ప్రేమను అలాగే నన్ను అభిమానించే వారి ప్రేమను కూడా అప్పుడే అర్థం చేసుకున్నాను అంటూ మన ఈ సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి.