Manchu Manoj: బ్రో నిర్మాతలతో మంచు మనోజ్ సరికొత్త టాక్ షో… భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా?

Manchu Manoj: మంచు మనోజ్ సినిమాల పరంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడంతో ఈయన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అప్పుడెప్పుడో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించారు.మరి ఆ సినిమా పరిస్థితి ఏంటో ఇప్పటివరకు తెలియడం లేదు అయితే తాజాగా ఈయన వాట్ ది ఫిష్ అనే సినిమా ప్రకటించారు.

ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ ఈయన మాత్రం తన వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియా వార్తలు నిలిచారు. ఈయన విడాకులు తీసుకున్న తర్వాత భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారు. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయితే చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మనోజ్ మౌనికల వివాహం ఈ ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా వివాహం తర్వాత మంచు మనోజ్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం మంచు మనోజ్ త్వరలోనే ఒక ఓటీటీలో ప్రసారం కాబోయే ఒక టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో ఇలా ఓటీటీలలోప్రసారం కాబోయే టాక్ షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా హోస్టుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.

Manchu Manoj: హోస్ట్ గా మనోజ్…


ఇక ఈ టాక్ షోని బ్రో సినిమా నిర్మాతలు నిర్మించబోతున్నారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలోనే ఈ టాక్ షో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ టాప్ షో ఏ ఓటీటీలో ప్రసారం కాబోతుంది ఎప్పుడు ప్రసారం కాబోతుందనే విషయాల గురించి త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మరి మనోజ్ వ్యాఖ్యతగా ఈ టాక్ షోని సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.