Manchu Manoj: మంచు మనోజ్ సినిమాల పరంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడంతో ఈయన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అప్పుడెప్పుడో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించారు.మరి ఆ సినిమా పరిస్థితి ఏంటో ఇప్పటివరకు తెలియడం లేదు అయితే తాజాగా ఈయన వాట్ ది ఫిష్ అనే సినిమా ప్రకటించారు.
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ ఈయన మాత్రం తన వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియా వార్తలు నిలిచారు. ఈయన విడాకులు తీసుకున్న తర్వాత భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారు. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయితే చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మనోజ్ మౌనికల వివాహం ఈ ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా వివాహం తర్వాత మంచు మనోజ్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం మంచు మనోజ్ త్వరలోనే ఒక ఓటీటీలో ప్రసారం కాబోయే ఒక టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో ఇలా ఓటీటీలలోప్రసారం కాబోయే టాక్ షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా హోస్టుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ టాక్ షోని బ్రో సినిమా నిర్మాతలు నిర్మించబోతున్నారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలోనే ఈ టాక్ షో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ టాప్ షో ఏ ఓటీటీలో ప్రసారం కాబోతుంది ఎప్పుడు ప్రసారం కాబోతుందనే విషయాల గురించి త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మరి మనోజ్ వ్యాఖ్యతగా ఈ టాక్ షోని సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…