‘బోర్ కొడుతోంది’ అంటూ మంచు విష్ణు ట్వీట్.. ఏకిపారేసిన నెటిజన్లు..

కొన్ని రోజుల కిందటే మా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ విజయవంతంగా ఎన్నికలు ముగిసి.. అధ్యక్ష పీఠంపై మంచు విష్ణు కూర్చున్నారు. తాజాగా మంచు విష్ణు ఓ పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు. అసలేంటి ఆ ట్వీట్.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. గత రెండో రోజులుగా మళ్లీ ‘మా’ వ్యవహారాలు రచ్చకెక్కాయి.

మా కార్యాలయానికి తాళాలు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని..ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు ఆరోగ్యం బాగాలేకపోతే.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తుండగా.. మా అధ్యక్షుడు మాత్రం పట్టించుకోకపోవడంపై ట్రోలింగ్ జరిగాయి.

దీంతో మంచు విష్ణు దీనికి సమాధానంగా.. తాను ఆసుపత్రి వర్గాలతో మాట్లాడానని.. అతడికి అన్ని విధాలా అండగా ఉంటానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ పై నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. ఇది పోస్టు చేసిన మరుసటి రోజే మంచు విష్ణు మరో పోస్ట్ వేశాడు.

బోర్ ఫీల్ అవుతున్నాను అంటూ తీరిగ్గా అలా సేద తీరుతున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక దీనిపై కూడా నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. రకరకాల కామెంట్లతో ట్రోల్ చేసి పడేశారు. నీ సినిమాలు చూసినప్పుడు కూడా మాకు అదే ఫీలింగ్ అని.. మా బిల్డింగ్ కట్టించు బోర్ ఉండదు.. మోసగాళ్లు సీక్వెల్ తియ్ బోర్ కొట్టదు.. అంటూ అతడి ట్వీట్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.