అంతర్జాతీయ తెలుగు సంబరాలకు తెలుగు కవులు తరలి రావాలి : శ్రీ మండలి బుద్ధ ప్రసాద్

భీమవరం : ఆంధ్ర సారస్వత పరిషత్ , ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు తెలుగు కవులు అందరూ తరలి రావాలని ఆంధ్ర ప్రదేశ్ పూర్వ శాసనసభాధిపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శ్రీ బుద్ధప్రసాద్ గారిని కృష్ణా జిల్లా తెలుగు రచయితల స్స్వర్ణోత్సవ సభలలో కలసి ఆహ్వానించామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

2022 జనవరి 7,8 వ తేదీ లలో వెస్ట్ బెర్రీ హైస్కూల్ ప్రాంగణం, పెద అమిరం, భీమవరం లో జరిగే తెలుగు సంబరాలలో తప్పక పాల్గొంటానని శ్రీ బుద్ధప్రసాద్ అన్నారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
శ్రీ బుద్ధప్రసాద్ గారిని కలసిన వారిలో ఉపాధ్యక్షులు సంబరాల ప్రధాన కార్యదర్శి శ్రీ రాయప్రోలు భగవాన్ , సభ్యులు శ్రీ లక్ష్మణ వర్మ, శ్రీ భట్టిప్రోలు శ్రీనివాస్, శ్రీ కొండేటి శివకుమార్ తదితరులు వున్నారు .