మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి..

మావోయిస్ట్ గడ్డం మధుకర్ కరోనాతో మృతి చెందాడు. ఈ నెల 2న కరోనా చికిత్సకోసం వరంగల్ వచ్చిన మధుకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కరోనా చికిత్స్ కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గడ్డం మధుకర్ మావోయిస్టు దండకారణ్య డివిజనల్ కమిటీ సెక్రెటరీగా ఉన్నారు. మధుకర్ స్వస్థలం కుమురం భీం జిల్లా జెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం. 22 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యుడిగా చేరారు. అయితే గడ్డం మధుకర్ తో పాటూ చాలా మంది మావోయిస్టు లీడర్లకు కరోనా సోకిందని పోలీసులు తెలిపారు.