Mega Brother Nagababu : కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు టేస్ట్ చేసి రావాలి… నాకు పంపలేదు… అర్పి తిట్లు తింటాడు… ఆలోచన తక్కువ…: మెగా బ్రదర్ నాగబాబు

Mega Brother Nagababu : మెగాస్టార్ తమ్ముడిగా అందరికీ సూపరిచితుడైనా సినిమాల్లో పెద్దగా కెరీర్ లేకపోయినా బుల్లితెర మీద జబర్దస్త్ కి జడ్జిగా మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగబాబు గారు దాదాపు జబర్దస్త్ పెట్టినప్పటి నుండి పదేళ్ళ పైగా నే జడ్జిగా వ్యవహరించినా అక్కడ చిన్న చిన్న విబేధాల కారణంగా బయటికి వచ్చేసారు. ఆయన రావడంతో ఆయనతో పాటు చంద్ర, ఆర్పీ, వంటి వారు బయటికి వచ్చేసారు. ఇక ఆ ఛానెల్ ఈ ఛానెల్ తిరిగి చివరకు మా టీవీ లో ఉన్న నాగబాబు గారు ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల మీద మాట్లాడారు. జబర్దస్త్ కామెండియన్స్ గురించి మాట్లాడారు.

ఆర్పీ మంచోడే కానీ ఆలోచన తక్కువ…

జబర్దస్త్ నుండి వవెళ్లిపోయిన తరువాత చాలా మంది కమెడియన్స్ పరిస్థితి బాగోలేదనే ప్రశ్నకు నాగబాబు గారు మాట్లాడుతూ చంద్ర సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఆర్పీ తన చేపల పులుసు వ్యాపారంలో కస్టపడుతున్నాడు అంటూ చెప్పారు. అలా చెబుతూ ఆర్పీ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు ఇంకా టేస్ట్ చేయలేదని, వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా వెళ్ళలేదని తినాలంటూ చెప్పారు.

ఆర్పీ తనకు చేపల పులుసు పంపలేదంటూ చెప్పాడు. ఆర్పీ చాలా మంచివాడంటూ చెప్పిన నాగబాబు అయితే తనకు ఆలోచన తక్కువ అని తొందరగా ఆవేశంగా మాట్లాడుతాడు అంటూ చెప్పారు. దాని వల్ల అనవసరంగా తిట్లు తింటాడు అంటూ చెప్పారు. జబర్దస్త్ లో చిన్న చిన్న మేనేజర్లు, సిబ్బంది వల్లే అసలు గొడవ మేనేజ్మెంట్ తో కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.