Mohan Babu: రాజకీయాలకు నేను పనికిరాను… నన్ను మోసం చేశారు… రాజకీయాలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అంచలంచలగా ఎదుగుతూ వచ్చారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలక్షణ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు మరోవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే మార్చి 19వ తేదీ మోహన్ బాబు తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విలేఖరి మోహన్ బాబును ప్రశ్నిస్తూ..ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత మీకు ఏ విషయంలో రాజకీయాలపై విరక్తి కలిగించేలా చేసిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ…

ప్రస్తుతం అదంతా ఆ ప్రస్తుతం… గతం గతః జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నేను కూర్చోలేను నన్ను రాజకీయాలలో మోసం చేశారు. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని నేను చెప్పను. ఇక అన్నయ్య ఎన్టీఆర్ నన్ను ఆ కాలంలోనే రాజకీయాలలోకి రమ్మన్నారు. అయితే నేను ముక్కుసూటితనంగా వ్యవహరించే తీరు రాజకీయాలకు పనికిరాదని నేనే వెనక్కి తగ్గాను.

Mohan Babu: రాజకీయాలలో అందరూ ఇమడలేరు…

రాజకీయాలలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలి. అప్పుడే మనం రాజకీయాలలో ముందుకు పోగలం లేదంటే రాజకీయ సన్యాసం తప్పనిసరి. ఇక ఈ రాజకీయాలలో అందరూ ఇమడలేరు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని,తనని ఎవరు రాజకీయాలలో వెనక్కి లాగలేదంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు రాజకీయాల గురించి చూసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.