Mohan Babu: పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు… డిపార్ట్మెంట్ గురించి మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు తాజాగా యంగ్ హీరో విశాల్ నటించిన లాఠీ సినిమా ప్రీరిలీజ్ వేడుకలు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమా వేడుకను తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ పోలీసుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసుల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తనకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఉందని తెలిపారు.సమాజంలో ఏ ఒక్క సంఘటన జరిగిన అందుకు సంబంధించిన నిజా నిజాలు కేవలం పోలీసులకు మాత్రమే తెలుస్తాయని అందుకే తనకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవమని తెలిపారు. ఇలా ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రశంసల కురిపిస్తూనే పోలీసుల పట్ల ఈయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Mohan Babu: ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు…

ఇలా ప్రజలకు ఎంతో సేవ చేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నడం తనని చాలా బాధిస్తోందని ఈ సందర్భంగా పోలీసుల గురించి మోహన్ బాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.