AP: రెడ్డిగా మారిన బుద్ధి మారలేదు.. ముద్రగడపై విమర్శలు కురిపించిన కుమార్తె క్రాంతి!

AP: కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికలలో ఎంతో ఘోర అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నికలలో భాగంగా ఈయన జనసేన పార్టీకి కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా తెలియజేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని శపతాలు చేసిన ఈయన ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గెలవడంతో తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది కేంద్రం కూడా మీ చేతుల్లోనే ఉంది.

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలి అంటూ ఈయన మాట్లాడారు అయితే పద్మనాభం చేసిన ఈ వ్యాఖ్యలపై తన కుమార్తె క్రాంతి స్పందించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ పద్మనాభ రెడ్డి గారు ఇంకొకసారి మీరు పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి విమర్శలు చేస్తే నేనే రంగంలోకి దిగుతాను. మీకు వయసు అయిపోయింది ఇక విశ్రాంతి తీసుకోండి అంతేకానీ ఇలా విమర్శలు చేయడం సరికాదు.

విశ్రాంతి తీసుకోండి…
ఇప్పుడు మీరు పద్మనాభ రెడ్డిగా మారారు రెడ్డిగా మారినా మీ బుద్ధి మారలేదు. ఇప్పుడు రెడ్డిగా మారిన మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ ఈమె తన తండ్రి అని కూడా చూడకుండా తండ్రి పై చేసిన ఈ విమర్శలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక ఈయన తెలుగుదేశం పార్టీకి జనసేనకు వ్యతిరేకంగా ఉండడంతో ఇప్పటికే జనసైనికులు ఈయనని మానసికంగా ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.