Nagachaitanya: పరశురామ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్… నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!

Nagachaitanya: గీతా గోవిందం సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ పరుశురామ్ గత ఏడాది మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో అనంతరం పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.

ఇకపోతే గతంలో ఓసారి నాగచైతన్యని కలిసిన పరుశురామ్ స్టోరీ వినిపించారని అయితే ఆ స్టోరీ నాగచైతన్యకు నచ్చకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ కూడా పెట్టారని ఫిక్స్ అయ్యారట. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఈ సినిమా చేయాలని నాగచైతన్యను పరుశురామ్ వెయిట్ చేయించారని తెలుస్తోంది.

ఇక కథ మొత్తం విన్నటువంటి నాగచైతన్య స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం సంతృప్తి పొందకపోవడంతో తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారట.అయితే తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి నాగచైతన్య ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఇక డైరెక్టర్ పరుశురామ్ గురించి కూడా మాట్లాడారు.

Nagachaitanya: నా టైం మొత్తం వేస్ట్ చేశారు..

ఇలా ఈ టాపిక్ రావడంతో నాగచైతన్య మాట్లాడుతూ
పరుశురామ్ గురించి మాట్లాడటం వేస్ట్ ఆయన తన సమయాన్ని చాలా వేస్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా తన టాపిక్ మాట్లాడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదని కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య ఈ సినిమా స్టోరీ రిజెక్ట్ చేసిన తర్వాత ఇదే కథతో పరుశురామ్ విజయ్ దేవరకొండ ను కలిసి కథ వినిపించారని సమాచారం.