Nagarjuna -Venkatesh: ఆ కారణం వల్లే వెంకటేష్ నాగార్జున మధ్య మాటలు లేవా… అసలేం జరిగిందంటే?

Nagarjuna -Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున అలాగే వెంకటేష్ వంటి హీరోలు కూడా ఒకరిని చెప్పాలి. వీరిద్దరూ సీనియర్ హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఇద్దరి హీరోలు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఒకప్పుడు ఎంతో స్నేహబంధంతో ఉన్నటువంటి నాగార్జున వెంకటేష్ మధ్య గత కొంతకాలంగా మాటలు లేవని ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కూడా ఎక్కడ కలిసి కనిపించినటువంటి సందర్భాలు కూడా లేవు. మరి వీరిద్దరూ ఇలా శత్రువులుగా ఉండటానికి కారణమేంటి ఎందుకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే విషయానికి వస్తే..

నాగార్జున వెంకటేష్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు దీంతో వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరికి నాగచైతన్య పుట్టిన తరువాత వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా తన చెల్లికి నాగార్జున అన్యాయం చేశారన్న కారణంతోనే వెంకటేష్ నాగార్జునతో దూరంగా ఉంటున్నారు దీంతో వీరిద్దరి మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి.

మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన నాగార్జున…

ఇకపోతే ఇటీవల వీరిద్దరూ కూడా నాగచైతన్య హీరోగా నటిస్తున్నటువంటి తండేల్ సినిమా పూజా కార్యక్రమాలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. చైతన్య వెంకటేష్ కి మేనల్లుడు నాగార్జున కొడుకు కావడంతో ఈ ఇద్దరు హీరోలు కూడా ఇక్కడ సందడి చేశారు. అయితే వెంకటేష్ అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంటర్ కాగానే నాగార్జున తనని చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం వెంకటేష్ కూడా నాగార్జున భుజంపై చేయి వేసి ఇద్దరు సరదాగా మాట్లాడుతూ లోపలికి వెళ్లడం విశేషం.