Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం మరొక మూడు రోజులలో పూర్తికానుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు అయితే వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి బయటకు రాగా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు ఫినాలేకి చేరుకుంటారు.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో పల్లవి ప్రశాంత్ అమర్ శివాజీ ఈ ముగ్గురు కూడా టైటిల్ రేస్ లో ఉన్నారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా యావర్ ప్రియాంక ఇద్దరు కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా కొనసాగడమే కాకుండా ఫిజికల్ టాస్కులలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆట తీరును కనపరుస్తున్నారు.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక హౌస్ లో ఉన్నటువంటి ఈ ఆరుగురిలో అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చారు. అంతే కాకుండా ఈయన ఒకరి దగ్గర మరొకరి మాటలను మాట్లాడుతూ నెటిజెన్స్ నుంచి కాస్త నెగిటివిటీనీ మూటగట్టుకున్నారు.
ఓటింగ్ లో వెనుకబడ్డ యావర్
ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వారం యావర్ ఓటింగ్ శాతం తగ్గిందని తెలుస్తుంది. దీంతో మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి యావర్ ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు రాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే యావర్ బయటకు వస్తే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని చెప్పాలి. మరి ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు రాబోతున్నారు ఎవరు కప్ అందుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…