Animal Movie: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించినటువంటి తాజా చిత్రం యానిమల్ ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపించారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ అనిల్ కపూర్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీగా సక్సెస్ అందుకోవడంతో కొందరు మాత్రం ఈ సినిమా పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఇటీవల పార్లమెంటులో కూడా ఈ సినిమా గురించి ఒక ఎంపీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల కారణంగా మనుషులు మారిపోరు కానీ వారి ఆలోచన విధానం పై ఇలాంటి సినిమాలు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు.
ఇలాంటి సినిమాలు చేసే విషయంలో నిర్మాతలు కూడా సమాజం పట్ల కొంత బాధ్యత ఉండాలి అని తెలిపారు.
సినిమాల వల్ల ఆలోచనలు మారకూడదు..
సినిమా చేయటం వల్ల మంచి ఆలోచనలు రాకపోయినా పర్వాలేదు కానీ చెడు ఆలోచనలు వచ్చేలా సినిమాలు చేయకండి అంటూ ఈయన తెలిపారు. సమాజంలో జరిగే తప్పులకు పూర్తి భాద్యత సినిమాలు అనడం లేదు. అలా అనడం కూడా తప్పు. కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం సమాజం పై భాద్యత వహించి సినిమాలు చేయడం మంచిదని తెలిపారు. ఇలాంటి సినిమాలు చేయడం వల్ల చిన్న పిల్లల పై కూడా ప్రభావాన్ని చూపుతాయని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…